AP: కడప జిల్లా ప్రొద్దుటూరు లింగాపురంలో ఓ జంట ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను కర్నూలుకు చెందిన ప్రమీల, రంగస్వామిగా పోలీసులు గుర్తించారు. కొంతకాలంగా వీరు ఇరువురు సహజీవనం చేస్తున్నట్లు తెలిపారు. అయితే ప్రమీల మృతితో ఆమె ఇద్దరు పిల్లలు అనాధలయ్యారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.