ప్రకాశం: పామూరు మండలం వీరబద్రాపురం గ్రామంలో ఎస్సై అనుక్ ఆధ్వర్యంలో పేకాట శిబిరాలపై ఇవాళ దాడులు నిర్వహించారు. ఈ తనిఖీలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని, రూ.5,350 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. మండలంలో ఎక్కడైనా పేకాట ఆడితే వెంటనే సమాచారం అందజేయాలని ప్రజల్ని కోరారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.