NLR: కందుకూరు మున్సిపాలిటీ శివారు ప్రాంతాలలో మంచినీటి సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం రూ.19 కోట్లు మంజూరు చేసిందని MLA నాగేశ్వరరావు అన్నారు. శనివారం కందుకూరులో ఆయన మాట్లాడుతూ.. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తైనట్లు పేర్కొన్నారు. త్వరలో శివారు ప్రాంత వాసుల మంచి నీటి సమస్యను పరిష్కరిస్తామన్నారు.