బాపట్ల పట్టణంలో నాణ్యమైన తాగునీటి పేరుతో నడుస్తున్న వాటర్ ప్లాంట్లపై ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతుంది. పట్టణంలో సుమారు 45 వాటర్ ప్లాంట్లు ఉన్నప్పటికీ చాలా వరకు నాణ్యత ప్రమాణాలు పాటించకుండా వ్యాపారం సాగిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్లాంట్లలో సరైన శుద్ధి ప్రక్రియలు పాటించకుండా ఉప్పు బోరు నీటిని కెమికల్స్ కలిపి తాగునీటిగా మారుస్తున్నారని విమర్శలు వస్తున్నాయి.