నెల్లూరు జిల్లా నవాబుపేటలో ఏఎస్పీ దీక్ష ఆధ్వర్యంలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను సీజ్ చేసి, పలువురికి జరిమానాలు విధించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ.. గంజాయి, మద్యం వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలన్నారు. అ సాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని ఆమె హెచ్చరించారు.