SS: చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాలకు సైబీరియన్ పక్షులు భారీగా చేరుకుని సందడి చేస్తున్నాయి. ఏటా చలికాలంలో వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఈ విదేశీ పక్షులు ఇక్కడి చెట్లపై విడిది చేసి సంతానోత్పత్తి సాగిస్తాయి. స్థానిక ప్రజలు వీటిని దైవసమానంగా భావిస్తూ రక్షణ కల్పిస్తున్నారు. పక్షుల రాకతో ఈ గ్రామాలు పర్యాటక ప్రాంతాలుగా మారుతున్నాయి.