PLD: నరసరావుపేట మండలం ములకలూరులోని ముస్లిం మైనార్టీ కళాశాల, హాస్టళ్లను వెంటనే ప్రారంభించాలని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ భవనాలను ఇతర విభాగాలకు అప్పగించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, మైనార్టీ విద్యార్థుల ప్రయోజనాల కోసం వీటిని వారికే కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు.