SKLM: పలాస నియోజకవర్గంలోని గ్రామాల్లో సర్పంచుల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో, పాలనలో ఎటువంటి జాప్యం జరగకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష ఆదేశించారు. ప్రజా ప్రతినిధులు లేని సమయంలో అధికారుల బాధ్యత మరింత పెరుగుతుందని గుర్తు చేశారు. పలాసలో తన కార్యాలయంలో సోమవారం అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.