కర్నూలులో పట్టణ ప్రణాళిక అధికారులు, సెక్రటరీలతో మున్సిపల్ కమిషనర్ విశ్వనాథ్ నిన్న టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. నగరంలో అనుమతులు లేకుండా నిర్మించిన అనధికార కట్టడాలపై భౌగోళిక సమాచార వ్యవస్థ (GIS) ఆధారంగా ఉక్కుపాదం మోపాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. ప్రతి సచివాలయ పరిధిలో GIS డేటా ఆధారంగా అక్రమ నిర్మాణాలను గుర్తించి అకస్మిక తనిఖీలు చేయాలని సూచించారు.