ATP: తాడిపత్రి మండలంలోని ప్రసిద్ధ ఆలూరుకోన రంగనాథస్వామి క్షేత్రానికి వెళ్లే భక్తులకు అధికారులు కీలక సూచన చేశారు. ఆలూరు గ్రామం నుంచి దేవస్థానం వరకు నూతనంగా తారు రోడ్డు పనులు చేపట్టినందున ఆదివారం వరకు వాహనాల రాకపోకలను దారి మళ్లించారు. భక్తులు ఆలూరు మీదుగా కాకుండా సజ్జలదిన్నె, ఓబులేసుకోన మార్గాల ద్వారా క్షేత్రానికి చేరుకోవాలని కోరారు.