BPT: రేపల్లెలో శుక్రవారం ‘అనగాని ప్రజా దర్బార్’ కార్యక్రమం జరిగింది. ఇందులో స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రజల వద్ద నుంచి సమస్యలతో కూడిన అర్జీలను స్వీకరించారు. ఈ సమస్యలన్నింటినీ మంత్రి అనగాని సత్యప్రసాద్ దృష్టికి తీసుకెళ్తామని వారు తెలిపారు. ఈ అర్జీలను వీలైనంత త్వరగా పరిష్కరించేలా తగిన చర్యలు తీసుకుంటామని నాయకులు ప్రజలకు హామీ ఇచ్చారు.