KRNL: మంత్రాలయం మండలం చిలకలడోణ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి ఎమ్మిగనూరు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్న బాధితులను మునిసిపల్ కమిషనర్ ఎన్.గంగిరెడ్డి పరామర్శించారు. అనంతరం వారి ఆరోగ్య పరిస్థితులను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.