TPT: తిరుమలలో భక్తుల భద్రత దృష్ట్యా తిరుపతి జిల్లా పోలీస్ శాఖ విస్తృత స్థాయి నాఖాబందీ కార్యక్రమం నిర్వహించింది. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, టీటీడీ చీఫ్ విజిలెన్స్ అధికారి మురళీ కృష్ణ ఆదేశాల మేరకు బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. సుమారు 90 మంది సిబ్బంది 6 బృందాలుగా ఏర్పడి బాలాజీ నగర్ ప్రాంతంలో తనిఖీలు చేపట్టి అనుమతి లేని వ్యక్తులపై దృష్టి సారించారు.