అన్నమయ్య: పంచాయతీ అభివృద్ధి అధికారులందరూ శిక్షణ జరిగే సమయంలో గ్రీన్ అంబాసిడర్లతో కలిసి తప్పనిసరిగా పనిచేయాలని కడప జెడ్పీ సీఈవో రామచంద్రారెడ్డి సూచించారు. రాజంపేట మండలం కూచివారిపల్లెలో పీడీవోలకు శిక్షణ ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ.. రోజూ చెత్త సేకరించాలని ఆదేశించారు. 3 లేదా 4 రోజులకు ఒకసారి తూతూ మంత్రంగా చెత్త సేకరించి, చేతులు దులుపుకొంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.