SKLM: మహావీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి 175వ వర్ధంతి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి శ్రీనివాసరావు హాజరై, నరసింహారెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తొలి తరం బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ధైర్యంగా పోరాడిన నరసింహారెడ్డి పోరాట స్ఫూర్తి నేటి తరాలకు ఆదర్శమని అన్నారు.