VZM: గజపతినగరంలోని సామాజిక ప్రభుత్వ ఆసుపత్రిలో సోమవారం శుద్ధ జల కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యురాలు రఘుమండ లక్ష్మి చేతుల మీదుగా ప్రారంభించారు. దివంగత మాజీ ఎంపీ కొండపల్లి పైడితల్లి నాయుడు జ్ఞాపకార్థం 3 లక్షల 75 వేల రూపాయలు విలువగల శుద్ధ జల కేంద్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కొండలరావు పాల్గొన్నారు.