రైతులు సాగుచేస్తున్న వేరుశెనగ పంటలో అధిక దిగుబడులు రావాలంటే సస్యరక్షణ, ఎరువుల యాజమాన్య పద్దతులు పాటించాలని రాగోల్ వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త పి.ఉదయ్బాబు అన్నారు. కోటబొమ్మాలి మండలం చిట్టేవలస, తిలారు గ్రామాల్లోని రైతులకు వేరుశెనగ పంటపై బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టెక్కలి ఏడీఏ కె. జగన్మోహన్రావు పాల్గొన్నారు.