GNTR: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో పేదల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే గళ్లా మాధవి స్పష్టం చేశారు. గురువారం రాత్రి శ్రీనివాసరావుపేటలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆమె 36 మంది లబ్ధిదారులకు రూ. 39,96,998 విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను అందజేశారు.నియోజకవర్గంలో ఇప్పటివరకు 464 మందికి రూ. 6 కోట్ల పైచిలుకు ఆర్ధిక సాయం అందించామన్నారు.