PLD: పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ చేపట్టిన ‘ప్రజల వద్దకు ప్రవీణ్ – 100 రోజులు 100 గ్రామాలు’ కార్యక్రమం బుధవారం రాత్రి బలుసుపాడు గ్రామానికి చేరుకుంది. పర్యటనలో భాగంగా ఆయన నేరుగా ప్రజల సమస్యలు విని, పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాలు ఉన్నప్పటికీ పర్యటన కొనసాగించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.