AKP: ఎలమంచిలి మండలంలో పలు గ్రామాలకు బుధవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఈఈ రాజశేఖర్ తెలిపారు. నిర్వహణ పనులు చేపడుతున్న కారణంగా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పురుషోత్తపురం, బయ్యవరం, పులపర్తి, లక్కవరం, రేగుపాలెం, రుక్మిణీపురం, లైన్ కొత్తూరు, పీఎన్ఆర్ పేట, పోతిరెడ్డిపాలెం తదితర గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు తెలిపారు.