TPT: ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా నాగలాపురం పీహెచ్సీ ఆధ్వర్యంలో శనివారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. డాక్టర్ విజయకుమార్ నాయకత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో మలేరియా నివారణపై ప్రజలకు సూచనలు ఇచ్చారు. దోమల ద్వారా వ్యాపించే మలేరియాను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ అరుణ్ కిషోర్ పాల్గొన్నారు.