VSP: ఆరిలోవ శ్రీకాంత్ నగర్లో ఏసీపీ అనేపు నరసింహమూర్తి ఆధ్వర్యంలో సీఐ మల్లేశ్వరరావు మరో 35 మంది పోలీస్ సిబ్బంది 230 ఇళ్లను విస్తృతంగా తనిఖీలు చేశారు. ఇవాళ తెల్లవారుజాము నుంచే జరిగిన ఈ తనిఖీల్లో రికార్డు లేని 14 బైకులను, రెండు ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సీపీ సూచనలతో తనిఖీలు చేశామని సీఐ తెలిపారు.