KDP: ఏపీ మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ సీఐటీయూ ఆధ్వర్యంలో కడప కార్పొరేషన్ కార్యాలయం వద్ద కార్మికులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులు తమకు ఉన్న పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జీతాల పెంపు, బకాయిల చెల్లింపు, ఉద్యోగ భద్రత వంటి అంశాల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.