అన్నమయ్య: విద్యుత్ కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లెలోని యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ డిస్కమ్ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రాజు, జిల్లా అధ్యక్షుడు నారాయణలతో కలసి మదనపల్లె కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. తమను రెగ్యులర్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.