PPM: కొమరాడ మండలం దలైపేట గ్రామ సమీపంలో ఉన్న వరి పంట పొలాలలో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు అటవీ శాఖ సిబ్బంది శుక్రవారం తెలిపారు. సమీప ప్రాంత రైతులు, గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏనుగులు కనిపిస్తే కవ్వింపు చర్యలకు పాల్పడవద్దన్నారు. ఇదిలా ఉంటే పంట పొలాలలో ఏనుగులు గుంపు ప్రవేశించి పంటలను పాడు చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.