KKD: మార్చి నెల ఒకటో తేదీ ఆదివారం కావడంతో ఒకరోజు ముందుగానే అంటే ఈనెల 28న జిల్లాలో సామాజిక భద్రతా పింఛన్లు పంపిణీ చేస్తామని కలెక్టర్ షన్మోహన్ గురువారం తెలిపారు. 2.68 లక్షల మంది లబ్ధిదారులకు రూ. 117.02 కోట్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శనివారం నాడే 100 శాతం పంపిణీ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వివరించారు.