సత్యసాయి: కదిరి మండలం కుమ్మరవాండ్లపల్లిలో జరిగిన పేలుడు ఘటనపై జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడంపై కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, ఎస్పీ సతీష్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని కలెక్టర్ ఆదేశించారు.