VZM: అంగన్వాడీ కార్యకర్తలు, హెల్పర్లు, చిరుఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి అన్నారు. ఈ మేరకు ఆదివారం ఎల్.కోటలోని టీడీపీ కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా చరిత్రలోనే రెండుసార్లు అంగన్వాడీ కార్యకర్తలు వేతనాలు పెంచిన ఘనత సీఎం చంద్రబాబునాయుడుకు దక్కుతుందన్నారు.