KDP: బి. కోడూరు మండలం రాజుపాలెం హరిజనవాడలో సోమవారం విషాదం చోటు చేసుకుంది. మున్నెల్లి చిన్న గురయ్య కుమారుడు(3) నీళ్ల బకెట్లో పడి మృతి చెందాడు. బాలుడు మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. ఘటరపై పోలీసులు కేసు నమోదు చేశారు.