CTR: రామకుప్పం (M) వీర్నమలకు చెందిన జ్యోతి-శివలింగం దంపతుల కుమారుడు నవీన్ అంతర్జాతీయ షూటింగ్ బాల్ టోర్నీలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి అద్భుత విజయాన్ని సాధించాడు. నేపాల్లో జరిగిన ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో నవీన్ ఉత్తమ ప్రతిభను ప్రదర్శిస్తూ దేశ గౌరవాన్ని మరింత ఎత్తుకు తీసుకెళ్లాడు. దీంతో పలువురు అతన్ని అభినందించారు.