NTR: జగ్గయ్యపేట ఎంపీడీవో మాధవ్ శర్మని జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ విధానాలకు అనుగుణంగా మండల పరిషత్ పరిధిలోని అభివృద్ధి కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షిస్తానని ఎంపీడీవో మాధవ్ శర్మ తెలిపారు.