SKLM: కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ శుక్రవారం హిరమండలం జడ్పీ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అందిస్తున్న చిక్కీలను స్వయంగా పరిశీలించారు. ఈ క్రమంలో గడువు తీరిన చిక్కీ ప్యాకెట్ను గుర్తించిన ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యురాలైన ఇంఛార్జ్ హెచ్ఎం ఎస్తేర్ రాణికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.