KDP: పులివెందులలోని స్థానిక YSVRM ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫలితాలలో ప్రతిభ చూపిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపల్ శ్రీనివాసులు అభినందించారు. కష్టపడి చదివి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆయన సూచించారు. ఇంటర్ ఫలితాల్లో విద్యార్థులు ప్రతిభ చూపడంతో జిల్లా స్థాయిలో తమ కళాశాలను మొదటి స్థానంలో నిలబెట్టారని తెలిపారు.