AKP: నర్సీపట్నం మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ బలిఘట్టం బ్రహ్మ లింగేశ్వర స్వామి ఆలయంలో సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీ పెద్ద చెరువు ప్రాంతంలో 108 అడుగులతో నిర్మించబోతున్న శివపార్వతుల విగ్రహంతో రైతులకు నష్టం వాటిల్లుతుందన్నారు. సృష్టి క్షేత్రాన్ని బలిఘట్టం పుణ్యక్షేత్రంలో నిర్మించాలని డిమాండ్ చేశారు.