KRNL: తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి చెందిన శశి అదృశ్యమవడంతో కుటుంబ సభ్యులు జొన్నగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్సై మల్లికార్జున మొబైల్ సిగ్నల్ ఆధారంగా గ్రామ శివారులోని పొలంలో అతడిని గుర్తించారు. స్పృహలేని స్థితిలో ఉన్న శశిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. దీంతో పోలీసులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.