CTR: పుంగనూరు పట్టణం మున్సిపల్ బస్టాండ్ సమీపాన గల శ్రీ విరూపాక్షి మారెమ్మ శుక్రవారం అమావాస్య సందర్భంగా మహిషాసుర మర్దిని అలంకారంలో భక్తులకు దర్శన భాగ్యం కల్పించింది. అర్చకులు సుప్రభాత సేవతో అమ్మవారిని మేల్కొల్పి అభిషేకాలు నిర్వహించారు. తర్వాత మహిషాసుర మర్దిని రూపంలో అలంకరించి పూజలు నిర్వహించగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.