KRNL: ఎమ్మిగనూరులో అంబేద్కర్ విగ్రహానికి పెయింటింగ్, లైటింగ్ ఏర్పాటు చేయాలని దళిత సంఘాల నేతలు కోరారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గంగిరెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. విగ్రహం పరిసరాల్లో పారిశుధ్య పనులు చేపట్టాలని ఈరన్న, చిన్ని ప్రసాద్, వీరేష్ డిమాండ్ చేశారు. మహనీయుల విగ్రహాల నిర్వహణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని విజ్ఞప్తి చేశారు.