విజయనగరం ఎమ్మెల్యే అదితి విజయలక్ష్మి గజపతి రాజు ఏప్రిల్ 16 నుంచి 30 వరకు ఏపీలో జరుగుతున్న స్వీయ జనగణనలో తన వివరాలను నమోదు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనగణన గణాంకాలు భవిష్యత్తు ప్రణాళికలకు పునాది వంటివని పేర్కొన్నారు. ప్రభుత్వం అందించే ఈ అవకాశాన్ని పౌరులందరూ బాధ్యతగా వినియోగించుకోవాలని కోరారు.