GNTR: ఇంటర్ ఫలితాల్లో జిల్లా సత్తా చాటింది. ఫస్టియర్, సెకండియర్లలో 88 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలోనే రెండో స్థానంలో నిలిచింది. సెకండియర్లో 30,551 మంది పరీక్ష రాయగా.. 26,856 మంది పాసయ్యారు. ఫస్టియర్లో 33,643 మందికి గానూ 29,530 మంది ఉత్తీర్ణులయ్యారు. సప్లిమెంటరీ పరీక్షలు మే 21 నుంచి జూన్ 4 వరకు, ఫీజు చెల్లింపునకు అధికారులు ఏప్రిల్ 20 నుంచి 27 వరకు గడువు ఇచ్చారు.