SS: రొద్దం మండలంలో నూతనంగా నిర్మించిన రహదారిని మంత్రి సవిత బుధవారం పరిశీలించారు. పావగడ ప్రధాన రహదారి నుంచి దొడగట్ట గ్రామం వరకు రూ.10.25 కోట్ల నిధులతో ఈ రోడ్డు పనులు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రహదారి నాణ్యతను అధికారులతో కలిసి ఆమె స్వయంగా తనిఖీ చేశారు. మారుమూల గ్రామాలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరచడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు.