ELR: జంగారెడ్డిగూడెం పట్టణ శాఖా గ్రంధాలయం జనరల్ బాడీ సమావేశం ఛైర్మన్ కొప్పాక శ్రీనివాసరావు అధ్యక్షతనలో ఇవాళ జరిగింది. గ్రంధాలయాన్ని గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ వన్గా మార్చాలని ఒక తీర్మానాన్ని చేశారు. గ్రంధాలయానికి పాఠకుల సంఖ్య పెంచాలనేది లక్ష్యాన్ని పెట్టుకున్నామని, అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు.