సత్యసాయి: కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తిరువనంతపురం విచ్చేసిన బీజేపీ జాతీయ నేత జేపీ నడ్డాను మంత్రి సత్యకుమార్ యాదవ్ కలిశారు. తిరువనంతపురం జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, గెలుపు అవకాశాలపై నడ్డాకు నివేదిక సమర్పించారు. ప్రత్యర్థుల వ్యూహాలను తిప్పికొట్టి ప్రతి ఓటరును చేరుకునేలా పటిష్ట ప్రణాళికలపై చర్చించారు.