WG: నరసాపురం రుస్తుంబాదకు చెందిన పేరి సాయి శరవణ (16) అనే బాలుడు అదృశ్యమైనట్లు పట్టణ ఎస్సై ముత్యాలరావు తెలిపారు. పోలీసుల కథనం ప్రకారం.. ఈనెల 1వ తేదీన మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయాడు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఫలితం లేకపోవడంతో శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.