NDL: చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామంలో రైతు భరోసా కేంద్రం భవన నిర్మాణం ఐదేళ్లుగా పూర్తికాక రైతులకు అందుబాటులోకి రాలేదు. గత ప్రభుత్వంలో రూ.12 లక్షలతో ప్రారంభించిన పనులు నిధుల కొరత, ప్రభుత్వం మార్పుతో నిలిచిపోయాయి. దీంతో రైతులు, వ్యవసాయ శాఖ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు.