కడప: ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు 2026-27 విద్యా సంవత్సరానికి ముందస్తు అడ్మిషన్లు చేపట్టి ఫీజుల దోపిడికి పాల్పడుతున్నాయని AISF, AIYF జిల్లా నాయకులు ఆరోపించారు. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి అక్రమ అడ్మిషన్లపై చర్యలు తీసుకోవాలని తెలిపారు. లేనిపక్షంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.