AKP: ధ్వంసమైన రోడ్లను వెంటనే నిర్మించాలని సీపీఎం ఆధ్వర్యంలో ఇవాళ పరవాడ ఎంపీడీవో కార్యాలయం జంక్షన్ వద్ద ఆందోళన నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జీ.కోటేశ్వరరావు మాట్లాడుతూ.. హిందూజా, NTPC బొగ్గు లారీల అధిక లోడ్ల వల్ల వల్ల కాలుష్యం పెరిగి రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. దీంతో ఈ మార్గంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయని అన్నారు.