PPM: గ్రామాల్లో అనుమానిత వ్యక్తులపై స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని పాచిపెంట ఎస్సై లాలం అర్జున్ కోరారు. ఈ మేరకు మంగళవారం మండలంలో పలు గ్రామాల్లో ఆటో ప్రచారం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. సైబర్ క్రైమ్, పోక్సో చట్టాలపై ఆటో ద్వారా అవగాహన కల్పించారు.