సత్యసాయి: జిల్లాలోని ప్రభుత్వ వసతి గృహాల్లో CSR నిధులతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. హిందూపురం నియోజకవర్గంలో రూ.15 లక్షల వ్యయంతో మరమ్మతు పనులు చేపట్టిన బర్జర్ పెయింట్స్ ప్రతినిధులు రాజేశ్, దేవరాజులను శనివారం ఆయన సన్మానించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి పారిశ్రామిక సంస్థలు సహకరించాలని కోరారు.