గుంటూరు మిర్చి యార్డ్లో ఖాళీ గోనెసంచి ధరను 10 ఏళ్ల తర్వాత పెంచారు. గోతానికి రూ.15 నష్టం భరిస్తున్నామని రైతులు మంత్రి అచ్చెన్నాయుడుకు తెలియజేయగా, ఆయన జోక్యంతో నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్యతో ఏటా సుమారు రూ.30 కోట్ల లాభం రైతులకు దక్కనుంది. తక్కువ ధర ఇస్తే వెంటనే ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు.