GNTR: ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల కోసం వినూత్న సాహసయాత్రకు శ్రీకారం చుట్టారు మంత్రి నారా లోకేష్. సమగ్రశిక్ష ఆధ్వర్యంలో దేశంలోనే తొలిసారిగా 21 మంది విద్యార్థులతో కూడిన బృందం ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహణకు సిద్ధమైంది. ఏప్రిల్ 15 నుంచి 30 వరకు 16 రోజులపాటు జరిగే ఈ యాత్రలో విద్యార్థులు ఖాట్మండు చేరుకుని అక్కడి నుంచి ట్రెక్కింగ్ ప్రారంభిస్తారు.